నాకు గుర్తున్నంతవరకు నేను చదివిన మొదటిపుస్తకం 'ఏడు తరాలు'.బానిస బతుకుల గురించి 'అలేక్సే హేలే ' కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు..చాలా ఆసక్తిగా చదివినట్లు గుర్తు..
చాలా రోజుల తరువాత మళ్ళీ 'నవీన్ ' రాసిన 'అంపశయ్య' చదివాను..మొదలుపెట్టిన దగ్గరనుండి పుస్తకం కింద పెట్టకుండా చదివిన పుస్తకం ఇదేనేమో..మనిషి మనసు లోతుల్లోని ఆలోచనలను,నిత్యం చలరేగే సంఘర్షణలను ,కోరికలను..అద్భుతంగా ,సహజాతి సహజం గా రాశాడు.
తరువాత 'శ్రీ శ్రీ ' రాసిన 'మహాప్రస్థానం '..ఈ పుస్తకం గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసినది ఏమిలేకున్నా ..'శ్రీ శ్రీ' రాసిన మొట్టమొదటి కవిత 'కొంపెల్ల జనార్ధన రావు 'మీద ..చాలా ఆశువుగా వుంటుంది..
నాకు నచ్చిన /గుర్తున్న కొన్ని లైన్లు ..
తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం ..
సెలవంటూ ఈ లోకాన్ని వదలి ...
తలపోసినవేవీ కొనసాగాక పోగా...
పరివేదన బరువు కాగా ..
అటుచూస్తే..ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వూ చేయూతనివ్వక ...
మురికితనం కరుకుతనం నీ సుకుమారపు
హృదయానికి గాయం చేస్తే ..
అటుపొతే ..ఇటుపోతే..అంతా అనాదరణతో ,అలక్ష్యంతో చూసి ..
ఒక్కన్ని చేసి వేధించారని ,బాధించారని ..
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం ..
తలవంచుకు వెళ్ళిపోయావ నేస్తం ...
అంటూ సాగే ఈ కవిత చాలా ఆలోచింపజేస్తుంది ...
తరువాత నేను చదివిన పుస్తకం 'బాలగంగాధర తిలక్' అమృతం కురిసిన రాత్రి '.....ఈ పుస్తకం చదివినవారి మనసంతా అనుభూతిమయం అని చెప్పక తప్పదు ..అంత బాగా వుంటుంది..కవిత్వాన్ని ఆస్వాదించేవారు తప్పక చదివి తీరవలసిన పుస్తకం..
తరువాత 'చలం' గారి పుస్తకాలు ..మైదానం ,మ్యూజింగ్స్ ,దైవమిచ్చిన భార్య ,ప్రేమలేఖలు ..వేటికవే ప్రత్యేకం..స్త్రీ స్వేచ్చ ,వ్యక్తిత్వం దృష్టిలో వుంచుకొని చలం తనదైన శైలిలో కావ్య ఖండికలను సృజించాడు..స్త్రీని వస్తువుగా చూడటాన్ని అసహ్యించుకుంటాడు ..అందుకే చలం స్త్రీ పక్ష పాతి గా పేరుతెచ్చుకున్నాడు..
కో.కు ,రావిశాస్త్రి,బుచ్చి బాబు పుస్తకాలు ఆప్పుడప్పుడూ ..అక్కడక్కడా ..చదివినట్టు గుర్తు ...
'వేమన్న ' రాసిన శతకాలు..శ్రీ కృష్ణుడి గీతా పారాయణం అప్పుడప్పడూ చదువుతూ ఉంటాను..నేను చదవాలని అనుకోని చదవలేక పోయిన పుస్తకాలు 'రంగనాయకమ్మ 'గారి పుస్తకాలు..ఆవిడ పుస్తకాలలో వుండే విపరీతమైన తర్కం నాకు అంతగా అర్థం కాక పోవడమే కొంత కారణం కావచ్చు..
చాలా రోజుల తరువాత కార్టూనిస్టు 'మోహన్ ' గారు రాసిన పుస్తకం చదివా ..చాలా బాగుంది..సమకాలిన కార్టూనిస్టుల గురించి ..కార్టూనిస్టుల జీవితాల గురించి చాలా చక్కగా వర్ణించాడు ..
పుస్తకాలు చదివే ఓపిక ,సమయం లేక పోవడం వల్ల మాగజైన్లు ,వీక్లీ లు ,బ్లాగులు,పిట్టకధలు చదవడం అలవాటు అయింది..కాక పోతే ప్రయాణాలలో మాత్రం కచ్చితం గా పుస్తకాన్ని తీసుకొని బయలుదేరుతాను..
'మంచి పుస్తకం ..మంచి స్నేహితుడి వంటిది ' అని నమ్మే వాళ్ళలో నేనూ ఒకన్ని ....